కరోనా పీరియడ్ లో ఆ రెండు సినిమాలను ఎవరూ చూడొద్దని దర్శకుడు గౌతమ్ మీనన్ సలహా ఇచ్చాడు. కరోనా హాలిడేస్ లో సినిమా వాళ్లు తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ఫలానా పుస్తకం చదవమని.. ఫలానా వెబ్ సిరీస్.. లేదంటే సినిమా చూడమని సలహా ఇస్తున్నాడు. కానీ.. స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మాత్రం.. తను డైరెక్ట్ చేసిన ఆ రెండు సినిమాలు చూడొద్దని సలహా ఇస్తున్నాడు. 

 

గౌతమ్ మీనన్ ఇచ్చిన సలహా అందరికంటే వైవిధ్యంగా ఉంది. కరోనా కట్టడిలో భాగంగా వచ్చే నెల మూడో తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఇంటికే పరిమితమైన ప్రజలు.. సినిమాలు.. వెబ్ సిరీస్ తో కాలక్షేపం చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కరోనా వైరస్ నియంత్రణ గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తను దర్శకత్వం వహించిన సాహసం శ్వాసగా సాగిపో.. ఎంతవాడుగానీ సినిమాలను ఎవరూ వీక్షించొద్దని గౌతమ్ మీనన్ కోరాడు. 

 

ఎంతవాడు గానీ.. సినిమాలో అజిత్ తన కుమార్తెతో కలిసి కంట్రీ టూర్ కు వెళ్తాడు. అలాగే సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్య తన ప్రేయసితో కలిసి బైక్ పై లాంగ్ టూర్ కు వెళ్తాడు. ఈ రెండు సినిమాలు చూస్తే.. బయటకు వెళ్లాలనే ఆలోచన కలుగుతుందని.. ఈ పరిస్థితుల్లో అదంత సురక్షితం కాదని.. అందుకే ఆ రెండు సినిమాలను చూడొద్దని సలహా ఇచ్చాడు గౌతమ్ మీనన్. 

 

గౌతమ్ మీనన్ విక్రమ్ తో 2016లో మొదలుపెట్టిన ధృవనక్షత్రం కొన్ని కారణాల వలన రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది వస్తుందని భావిస్తున్నాడు. వరుణ్, రాహి జంటగా.. యాక్షన్ థ్రిల్లర్ జోషు ఇమై పోల్ కాకా మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు కమల్ హాసన్ తో రాఘవన్ 2 ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. రాఘవన్ సినిమాలో కమల్, కమలినీ ముఖర్జీ  బైక్ మీద పాడుకునే సాంగ్ గుర్తుకువస్తే.. ఈ సినిమా కూడా చూడొద్దని గౌతమ్ మీనన్ చెబుతాడేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: