సాధారణంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడికి వెంటనే మరో సినిమా అవకాశం వస్తుంది. అన్ని పనులు చకచకా జరిగిపోతుంటాయి. కానీ రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసిన సుకుమార్ తన తర్వాతి సినిమా స్టార్ట్ అవడం కోసం రెండేళ్ళు వెయిట్ చేశాడు. ప్రస్తుతం సుకుమార్ బన్నీ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు.

 


ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊరమాస్ గెటప్ లో బన్నీ లుక్ అదిరిపోయింది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కన్నా మాస్ గా కనిపించాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. అయితే సుకుమార్ పుష్ప కథని ముందుగా మహేష్ కి వినిపించాడని తెలిసిందే. నిజానికి రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్ అనుకున్న కథ వేరే ఉందట.

 

తెలంగాణ సాయుధ పోరాటంపై సినిమా తీద్దామనుకుని చాలా రీసెర్చి చేసి ఒకానొక ఎపిసోడ్ చుట్టూ కథ అనుకున్నారట. సాయుధ పోరాటాన్ని కథాంశంగా తీసుకుని మహేష్ బాబుని హీరోగా పెడ్తే ఎలా ఉంటుందని ఆలోచించాడట. అయితే చాలా మంది మహేష్ కి అలాంటి కథ సెట్ అవదని చెప్పేసరికి ఇప్పుడు బన్నీతో చేస్తున్న పుష్ప కథనే వేరేలా వినిపించాడట. కానీ మహేష్ ఒప్పుకోకపోవడంతో అదే కథకి కొన్ని మార్పులు చేసి అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. 

 

అయితే సుకుమార్ లాంటి దర్శకుడు అగ్ర హీరోతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని కథాంశంగా తీసుకుని సినిమాగా చేస్తే చాలా బాగుంటుంది. తెలంగాణ చరిత్ర మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అటువంటప్పుడు జనాల్లో ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మరి భవిష్యత్తులోనైనా సుకుమార్ ఆలోచనల్లో ఉన్న కథ తెర మీద చూస్తామేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: