టాలీవుడ్ ల ఇప్పుడు సినిమాల షూటింగ్ లేకపోవడం తో చాలా మంది ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ లు లేక చాలా మంది దర్శకులు ఇప్పుడు వార్తా చానల్స్ కి ఇంటర్వ్యు లు ఇస్తూ తమ సమయాన్ని ఎక్కువగా గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా ప్రధాన మీడియా ను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కరమంలోనే ఇదొక కొత్త విషయ౦ వాళ్ళు అభిమానులతో పంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా ఇదే పని చేస్తున్నారు. 

 

ఈ మధ్య కాలంలో అసలు మీడియా తో మాట్లాడని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునేది రాజమౌళి. ఆయన మీడియాతో ఎక్కువగా మాట్లాడటమే కాకుండా ఆయన సినిమాలకు సంబంధించిన అనేక విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయన ఒక విషయం బయటపెట్టారు. మహేష్ బాబు తో తన తర్వాతి సినిమా ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు ఆయన. ఆ సినిమా వచ్చే ఏడాది మొదలుపెట్టే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, 

 

దీనికి సంబంధించి చిన్న ప్రకటన వచ్చినా సరే పండగ చేసుకునే పరిస్థితి వచ్చింది అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ సినిమా కథ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీదనే చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది అంటూ కొన్ని కథనాలు కూడా ఎక్కువగా ప్రసారం అవుతున్నాయి. తెలుగు హీరోలు చాలా మంది జక్కన్న కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వారు అందరూ కూడా ఈ ప్రకటన చూసి కొంత వరకు షాక్ అయ్యారు అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: