క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తుంది. పుష్ప ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బన్నీ పేరు పుష్పరాజ్ అట. అందుకే సినిమాకి పుష్ప అనే టైటిల్ ని పెట్టారని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.


లారీ డ్రైవర్ గా ఎర్రచందనం దుంగలని స్మగ్లింగ్ చేస్తాడా లేదా పోలీసులకి సాయం చేస్తాడా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాల్సింది. కానీ లాక్డౌన్ కారణంగా ప్లాన్ మొత్తం మారిపోయింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పుష్ప చిత్రీకరణ మొదలు కానుంది. శేషాచలం అడవుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనుంది. చిత్తూరు ప్రాంత నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీనటులందరూ చిత్తూరు యాసలోనే మాట్లాడుకుంటారట.

 

బన్నీ ఈ యాసని నేర్చుకుంటున్నాడు కూడా. అయితే తాజా సమాచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమాకి సీక్వెల్ తీద్దామనే ఆలోచనలో ఉన్నాడట. పుష్ప సినిమా కోసం సుకుమార్ ఎంతగానో రీసెర్చ్ చేశాడు. ఎంతో మందిని కలిశాడు. వారందరు చెప్పిన కథలనుండి కొంచెం కొంచెం తీసుకుని తానొక కథ రాసుకున్నాడు. అయితే ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉండడంతో సీక్వెల్ తీద్దామని అనుకుంటున్నాడట.

 

కానీ సీక్వెల్ కన్నా వెబ్ సిరీస్ తీస్తే మరింత బాగుంటుందనే ఆలోచన్లో ఉన్నాడట. పుష్ప కథకి రిలేటెడ్ గా ఉండే కథలతో వెబ్ సిరీస్ తీసి క్యాష్ చేసుకుందామని అనుకుంటున్నాడు. ఈ విషయమై అమెజాన్ ప్రైమ్ తీ చర్చలు జరుగుతున్నాయట. రామ్ చరణ్ సుకుమార్ కి ఈ విషయంలో హెల్ప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పుష్ప సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: