ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోయాడు మాస్ మహారాజా రవితేజ. మినిమమ్ గ్యారంటీ హీరోగా రవితేజ నటించిన సినిమాలు చాలా వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అయితే కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత రాజా ది గ్రేట్ సినిమా తో వచ్చిన రవితేజ మంచి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత నటించిన రవితేజ సినిమాలు చాలా వరకూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుస ప్లాపులు నమోదు చేసుకుంటున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'డిస్కో రాజా' సినిమా ప్లాప్ కావటంతో...ప్రస్తుతం రవితేజ ఫోకస్ అంతా  'క్రాక్' సినిమా పైనే ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ కెరీర్లో 66వ సినిమా.

 

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ కనిపిస్తుండగా  శృతిహాసన్ - వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకోగా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరోపక్క 'రాక్షసుడు'లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకోవడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఈ సినిమా లో రవితేజ పక్కన హీరోయిన్ గా నటించడానికి ఎవరూ ఒప్పుకోవడం లేదట. స్క్రిప్ట్ డిమాండ్ బట్టి ఇద్దరు హీరోయిన్లు అవసరమని ఫిలింనగర్ లో టాక్. అయితే వరుస ఫ్లాపుల్లో రవితేజ ఉండటంతో సినిమాలో నటించడానికి క్రేజ్ ఉన్న హీరోయిన్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదట. దీంతో ఎవరైనా తమిళ కన్నడ భామల్ని లైన్ లో పెట్టడానికి టీమ్ ప్రయత్నిస్తోందట. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ని రీసెంట్ గా సంప్రదించారట చిత్ర యూనిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: