టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటున్నాడు. దీని కోసం ఆయన 25 లక్షల విరాళం ఇవ్వడమే కాకుండా సొంతంగా తన వాలంటీర్లతో అవసరమున్న వారికి నిత్యావసర సరుకుల్నీ అందజేస్తున్నాడు. రోజు ఎన్నికుంటుబాలకు సరుకుల్నీ అందిస్తున్నాడో.. దానికి ఎంత ఖర్చు అవుతుందో.. డోనేషన్స్ ఎంతోచ్చాయో మొదలగు అంశాలకు సంబందించిన ఓ బులెటెన్‌ను డైలీ విడుదల చేస్తున్నాడు. అయితే ఇదంతా నచ్చని కొంత మంది తనను టార్గెట్ చేసుకుని మీడియాలో తనపై కక్షపూరితంగా రాస్తున్న కొన్ని వెబ్‌ సైట్లపై మండిపడ్డారు. ఓ మూడు నాలుగు వెబ్‌సైట్లు కావాలనే తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. వాళ్ల తప్పుడు రాతల్ని తనపై రుద్దుతున్నారని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. అసలు మీరెవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ ఫైర్ అయ్యాడు. 

 

ఇప్పుడు చిత్ర‌సీమంతా విజ‌య్ దేవ‌ర‌కొండ వెనుక నిల‌బ‌డింది. 'కిల్ ఫేక్ న్యూస్‌' పేరిట‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టాలీవుడ్ ని ఏకం చేస్తున్నాయి. హీరోలంతా 'కిల్ ఫేక్ న్యూస్‌' అని నిన‌దిస్తున్నారు. #KillFakeNews #KillGossipWebsites #SpreadPositivity అనే హ్యాష్ టాగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ఓ ట్వీట్ చేసి విజ‌య్ దేవరకొండకి సంఘీభావం వ్య‌క్తం చేశాడు. అప్ప‌టి నుంచీ విజ‌య్ కి మ‌ద్ద‌తు పెరుగూనే ఉంది. రవితేజ, అనిల్ రావిపూడి, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, కొరటాల శివ, రానా దగ్గుబాటి, క్రిష్, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్ మొదలగువారు తమ ట్వీట్స్‌ తో సోషల్ మీడియా వేదికగా 'కిల్ ఫేక్ న్యూస్' అంటూ పోస్ట్ చేస్తున్నారు. 

 

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం విజ‌య్ వెనుక నిల‌బ‌డ్డాడు. ''డియ‌ర్ విజ‌య్‌.. మీ ఆవేద‌న నేను అర్థం చేసుకోగ‌ల‌ను. బాధ్య‌త లేని రాత‌ల వ‌ల్ల నేనూ, నా కుటుంబం బాధ ప‌డిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి'' అంటూ త‌న సంఘీభావం వ్య‌క్తం చేశాడు చిరు. అభిప్రాయాల్ని వార్త‌లుగా ప్ర‌చురించ‌వ‌ద్ద‌ని జ‌ర్న‌లిస్టుల‌కు హిత‌వు ప‌లికాడు. చిరంజీవికి ముందు మెగా బ్రదర్ నాగబాబు సైతం దేవరకొండకు సపోర్ట్ చేశారు. ట్వీట్ చేస్తూ.. 'హాయ్ విజయ్.. నేను నీకు బలంగా మద్దతిస్తున్నాను.. సినిమా పరిశ్రమ రక్తాన్ని పీల్చే కొన్ని వెబ్‌ సైట్లపై పోరాటం చేయడం అనేది.. వాటిపై స్పందించడమనేది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.. నువ్వు స్పందించినందుకు థ్యాంక్స్.. టైమ్ టు టేక్ యాక్షన్ మై బాయ్' అని పేర్కొన్నాడు. 

 

తాజాగా విజయ్‌ని సపోర్ట్ చేస్తూ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్ ట్వీట్స్ చేశారు. ''ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ నువ్వు. నీ సొంత డబ్బులుపెట్టి ఇంత సేవ చేస్తున్నావు. దాన్ని అంతా గౌరవించాలి కానీ ఊహించని విధంగా దీనిపై యుద్ధం మొదలైంది. మనమంతా కలిసి పోరాడదాం. నీకు మీకు అండగా ఉంటాం. యూ ఆర్ మై ఫైటర్'' అని పేర్కొంటూ పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఛార్మి ట్వీట్ చేస్తూ.. వ్యక్తిగతంగా నువ్వేంటో మాకు తెలుసు. మంచి చేసే నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నీవు చేసే మంచి పనులను ప్రపంచం గుర్తిస్తుంది. మా ఫైటర్‌కి అందరం అండగా ఉంటాం'' అని పేర్కొంది. మరోవైపు నిర్మాతల మండలి సైతం అలాంటి ఫేక్ వార్తలు రాసే వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: