టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.  ఆయన తీసే ప్రతి సినిమాల్లో ఓ వైవిద్యం ఉంటుంది.  కమర్సియల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీని ఆకట్టుకునే అంశాలు ఉంటాయి. అందుకే త్రివిక్రమ సినిమాలు అంటే ఓ ప్రత్యేకత అంటారు.  మాటల రచయితగా కెరీర్ ప్రారంభించి తర్వాత డైరెక్టర్ గా మారారు త్రివిక్రమ్.  ఇప్పటి వరకు త్రివిక్రమ్ మెగా హీరోలు పవన్ కళ్యాన్, అల్లు అర్జున్ తో తీశారు. ఆ తర్వాత మహేష్ బాబు తో ఒక్కసారి నితిన్ తో కూడా మూవీ తీశారు.  ఎప్పటి నుంచో యంగ్ టైగర్ అభిమానులు మా హీరోతో ఒక్క మూవీ తీస్తే బాగున్ను అనుకుంటున్న సమయంలో ‘అరవింద సమేత’ లాంటి బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ కి అందించాడు.    అమ్మ లాలించగలదు.. పాలించగలదు అన్న కాన్సెప్ట్ తో అద్భుతంగా మలిచారు.  

 

ఈ మూవీలో జగపతి బాబు యాక్షన్ బీభత్సం అని చెప్పొచ్చు. ఇందులో చాలా కాలం తర్వాత సునీల్ కమెడియన్ గా నటించారు. ఇదిలా ఉంటే.. సినిమాల్లోకి రావడానికి ముందునుంచే త్రివిక్రమ్ - సునీల్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో అద్దెకి ఉంటూ అవకాశాల కోసం తిరిగారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే వుంది. సునీల్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.. దాంతో మళ్లీ కమెడియన్ గా కొనసాగాలని నిర్ణయించుకుని, ఆ దిశగా గట్టి  ప్రయత్నాలే చేస్తున్నాడు.

 

 సునీల్ కి 'అరవింద సమేత' .. ' అల వైకుంఠపురములో' సినిమాల్లో త్రివిక్రమ్ అవకాశాలను ఇచ్చాడు. విక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ సినిమాలోనే సునీల్ కి త్రివిక్రమ్ మంచి పాత్ర ఇస్తున్నాడని, ఆ పాత్రతో సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. కాకపోతే ఇది అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ కాలేదు... ఇది ఎంత వరకు నిజమో త్వరలో తెలియాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: