ఎన్నో అద్భుతమైన హిట్ చిత్రాలను అందించిన దశాబ్ద కాల స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్. ఆయన నిర్మాణ సారధ్యంలో చిరంజీవి, కె రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం `జగదేకవీరుడు అతిలోకసుందరి` ఈ చిత్రం టాలీవుడ్ లో ఓ మైలురాయి లాంటిది అని చెప్పవచ్చు. 1990 మే 9న విడుదలైన ఆచిత్రం 30ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా అశ్వినీ దత్ ఓ పత్రికకు ఇటీవలె ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంధర్భంగా అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. అశ్విని దత్… ప్రభాస్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఆ చిత్రం గురించి ఆయన కొన్ని విషయాలను మనతో పంచుకున్నారు.
మహానటి చిత్రం తరువాత నాగ్ అశ్విన్ ఎటువంటి కథ చెవుతాడు అనుకుంటున్న తరుణంలో ఓ భారీ యూనివర్సల్ స్టోరీ చెప్పారట నాగ్ అశ్విన్. వందల కోట్ల బడ్జెట్ అవసరమయ్యే ఈ సినిమాకు ప్రభాస్ కరెక్ట్ అని నాగ్ అశ్విన్ ఆయనకి సూచించారట. ఇక కథ విన్న ప్రభాస్ వెంటనే ఓకె చెప్పారట. ఓ అద్భుతమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందన్న ఆయన 2020 అక్టోబర్ లో మొదలుపెట్టి 2022 ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. మరి కరోనా కారణంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రానికి కాస్త బ్రేక్ పడింది. ఇక ఆ చిత్రానికి టైటిల్ని ఇంకా ఖరారు చెయ్యలేదు. ఇటీవలె జార్జియాలో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇంకా క్లయిమాక్స్ సీన్స్ కోసం కరోనా తగ్గిన తర్వాత హైదరాబాద్లోనే సెట్స్ వేసి షూటింగ్ జరపనున్నారని సమాచారం.
ఇక ప్రభాస్కి ఉన్న క్రేజ్ ఎంత బడ్జెట్ పెట్టినప్పటికీ లాస్ అనేది ఉండదని నిర్మాతలు భావిస్తున్నరు. మరి కథ కథనాలు ఎలా ఉన్నా హీరోకి ఉండే క్రేజ్ని బట్టి కూడా నేడు కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ ముందు హిట్ కొడుతున్నాయి. ఇక సాహో చిత్రం కూడా అలానే హిట్ సాధించిందని చెప్పాలి. అందులోనూ నాగ్ అశ్విన్ కాబట్టి ఇక కథ గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు.