కొన్నాళ్ల క్రితం నుండి పలు ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అమలు అవుతున్న విషయం తెలిసిందే. దానితో అన్ని రంగాలు పూర్తిగా మూతపడటం, అలానే ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లల్లో ఉండిపోవడం జరిగింది. ఈ మహమ్మారి కరోనా నుండి మనమందరం సురక్షితంగా బయట పడాలి అంటే ఎవరికి వారు సోషల్ డిస్టెన్స్  పాటించి, తప్పని సరిగా ఎవరి ఇళ్లలో వారు ఉండాల్సిందేనని ప్రభుత్వం సూచనలు జరీ చేసింది. 

 

ఇకపోతే ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలతో పాటు పలువురు సినిమా నటులు కూడా ఇళ్లలోనే ఉంటూ తమ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కాగా వారిలో కొందరు తమ వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ గురించి విశేషాలను ప్రేక్షకులు అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకుంటుంటే, మరికొందరు మాత్రం పలురకాల ఛాలెంజ్ లు చేస్తూ వాటిలో పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం పాపులర్ అయిన ఛాలెంజ్ లలో  పిల్లో చాలెంజ్ కూడా ఒకటి. ఈ ఛాలెంజ్ లో హీరోయిన్లు ఒక దిండు మాదిరిగా ఉండే డ్రెస్సును ధరించి ఫోటోలు దిగి దానిని సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేయాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో చాలా మంది హీరోయిన్లు పాల్గొనడం జరిగింది. 

 

ముందుగా ఈ విధంగా ఒక దిండు మాదిరి డ్రెస్ వేసుకోవడం ఏంటో అర్ధం కానీ కొందరు నెటిజన్లలోని కొందరు, ఏంటబ్బా ఈ హీరోయిన్ డ్రెస్సు బదులు దిండు ఒంటికి కప్పుకుంది అని భ్రమ పడిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ రకమైన చాలెంజ్ ఎంత వరకు సక్సెస్ అయిందో తెలియదు కానీ, దీనిపై కొందరు మాత్రం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఖాళీగా ఉన్న సమయంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన చాలెంజ్ లు చేసి వాటిలో సక్సెస్ కావాలి, అంతేగాని ఈ విధంగా దిండు మాదిరి డ్రెస్ వేసుకుని ఫోటోలు పోస్ట్ చేయడంలో సదరు హీరోయిన్ల ఉద్దేశం అర్థం కావటం లేదని, ఆ దిండు మాత్రం ఎందుకు అది కూడా ఆ ఒక్కటి కూడా తీసేస్తే బాగుంటుంది కదా, అంటూ మరికొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ తమ  సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: