గత ఏడాది యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్, ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన హృద్యమైన ప్రేమకథగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతోందట. సీనియర్ నటి భాగ్యశ్రీ, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. 

 

ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం నాడు దిగిన ఫోటోలను మొన్న దర్శకుడు రాధాకృష్ణ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఇకపోతే ఈ సినిమా తరువాత ప్రభాస్, యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గతంలో మహానటి సినిమాతో మంచి హిట్ అందుకుని అందరి నుండి మంచి ప్రశంశలు అందుకున్న అశ్విన్, ప్రభాస్ కోసం ఒక మంచి సబ్జెక్ట్ ని సిద్ధం చేసినట్లు వినికిడి. తమ వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాని ఎంతో భారీ రేంజ్ లో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, పలువురు హాలీవుడ్ టెక్నీషియన్ల సాయంతో తెరకెక్కించనున్నట్లు నిన్నటి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నిర్మతగా అశ్వినీదత్ చెప్పడం జరిగింది. కాగా ఈ సినిమా కు దాదాపుగా రూ.500 కోట్ల పైచిలుకు ఖర్చు చేయనున్నట్లు టాక్. దానితో సినిమాపై కొంత రూమర్లు చెలరేగాయి. 

 

ఈ విధంగా ప్రభాస్ వరుసగా భారీ సినిమాలనే చేసుకుంటూ వెళ్లడం మంచిదే అని, అయితే ఏ మాత్రం తేడా కొట్టినా వచ్చే నష్టాలు కూడా ఎంతో భారీ స్థాయిలో ఉంటాయనేది ఆయన గుర్తుపెట్టుకోవాలని కొందరు కోరుతున్నారు. అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, కేవలం ఖర్చు పరంగా మాత్రమే కాక, ఈ సినిమా యొక్క కథ, కథనాలు కూడా ఎంతో గొప్ప తయారు చేయడం జరిగిందని, రేపు థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని నూటికి నూరుశాతం కట్టిపడేసేలా దర్శకుడు అశ్విన్సినిమా కథను సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం ప్రభాస్ ఖాతాలో ఈ సినిమా ద్వారా మరొక భారీ హిట్ చేరినట్లే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: