టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు ముఖ్య పాత్రలో మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మందినాథం మూవీతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది సొట్టబుగ్గల సిన్నది తాప్సీ పొన్ను.  మొదటి మూవీతోనే తన అందాలు ఆరోబోతతో కుర్రాళ్ల మనసు చెల్లా చెదురు చేసింది.  ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళంలో ఛాన్సులు దక్కించుకుంది.  అయితే ఎన్ని సినిమాల్లో నటించిన తాప్సీకి మంచి క్రెడిట్ మాత్రం దక్కలేదు.  దాంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అమితాబచ్చన్ నటించిన ‘పింక్’ మూవీలో తాప్సీ నటనకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు.  ఇంకేముంది బాలీవుడ్ లో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది ఈ హాట్ బ్యూటీ.  సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది తాప్సీ పొన్ను.

 

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టాలెంటెడ్ నటి తాప్సీ పన్నూ విదేశీ యువకుడితో డేటింగ్ చేస్తోందన్న వార్తలు నిజమేనని తేలాయి. ఆమే స్వయంగా బయటపెట్టిది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అవును నేనేమీ దాచిపెట్టడం లేదు.. అతనితో కలిసి ఇష్టంతోనే ఉన్నాను..  మా ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలుసు. వాళ్లు ఒప్పుకోకపోతే కథ ఇంతవరకు వచ్చేంది కాదు. ఇక జీవితంలో నాకంటూ కొన్ని లక్ష్యాలు, కోరికలు ఉన్నాయని.

 

కెరీర్ పరంగా ఇప్పుడు నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను.. అయితే మావాళ్లకు నచ్చకుంటే నేను నో చెబుతానని అతనికి ముందే చెప్పాను.. దానకి అతను కూడా ఓకే అన్నాడు. అయితే మా వాళ్ల మనసుకు ఆయన నచ్చాడు.. అందుకే మేం స్నేహం చేశామని చెబుతుంది సొట్టబుగ్గల చిన్నది.  డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆడగాడు మితియాస్ బోతో తాప్సీ పీకల్లో ప్రేమలో ఉంది.  బో తాస్పీ సోదరి షగున్ ద్వారా బో ఆమెకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం సెలబ్రెటీలు ఇంటిపట్టునే ఉంటున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: