ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ ఇంటి వద్ద ఉండాలని.. సామాజిక దూరం పాటించాలని.. మాస్కులు ధరించి బయటకు అవసరమైతేనే రావాలని ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఈ సమయంలో సినీ, టివి పరిశ్రమలు పూర్తిగా మూసివేశారు. ఈ సమయంలో వారు చేస్తున్న పనులు, వ్యాయామాలు, యోగాలు కొత్త రకం వంటలు ఒక్కటేమిటి ప్రతిరోజూ సోషల్ మీడియాలో సందడే సందడి అన్నట్లు ఉంటుంది. ఇదిలా ఉంటే ఓ టివి నటి తన మేకప్ మ్యాన్ దగ్గర అప్పుతీసుకుందనే వార్త వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. నిర్మాతలు డబ్బులివ్వక పోవడంతో చేసేదేం లేక మేకప్ మ్యాన్ దగ్గర రూ.15వేలు తీసుకుందట.
ఈ విషయం వారు..వీరు కాదు ఏకంగా ఆ నటి స్వయంగా తెలిపింది. ఏం చేయాలి.. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుంది.. బయటకు వెళ్లలేని పరిస్థితి అందుకే తప్పని సరి ఇలా చేయాల్సి వచ్చిందని అంటుంది. టెలివిజన్ నటి సోనాల్ వెంగర్లేకర్ పలు టీవీ సీరియల్స్లో నటిస్తుంది. లాక్ డౌన్ వలన ఈ రెండు నెలల్లో తన వద్ద ఉన్న మనీ మొత్తం అయిపోయిందట. ఈ సమయంలో తనకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన నిర్మాత ఒకరికి కాల్ చేసి డబ్బులడగగా అతను మొహంచాటేసాడని అంటుంది.
చేసేదేమి లేక తెలిసిన మేకప్ మ్యాన్ పంకజ్ గుప్తాకు ఫోన్ చేసి సాయం అడిగింది. దీంతో అతడు తన భార్య డెలివరీ కోసం దాచుకున్న రూ.15 వేలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి తన భార్య డెలివరీ సమయానికి ఇస్తే చాలని చెప్పడంతో ఆమె బాధతో ఈ పోస్ట్ చేసింది. అతడు చేసిన సాయానికి తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చింది. కష్టకాలంలో మన బాధల్ని చూసి చలించి పోయేవారు మంచి మనుషులు అని.. అతని సహయం నేను ఎప్పటికీ మర్చిపోలేనని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ ను పెట్టింది.