ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్ లన్ని ఆగిపోవడం తో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఇప్పుడు ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. ఇలా లాక్ డౌన్  లో  దొరికిన ఖాళీ సమయాన్ని కొంతమంది ఫిట్నెస్ పెంచుకోవడానికి ఉపయోగిస్తే మరికొంతమంది... ఏదో కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో విధంగా తమ అభిమానులకు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎంటర్టైన్మెంట్ పంచుతూనే ఉన్నారు. 

 

 అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందరూ ఇంట్లోనే ఉండండి తగిన జాగ్రత్తలు పాటించండి కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలండి అంటు  పిలుపునిస్తున్నారు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా  వైరస్ కు సంబంధించి ఎన్నో సూచనలు సలహాలు ఇస్తూ ప్రేక్షకులకు తన అభిమానులకు కూడా పాటించాలని చెప్పిన విషయం తెలిసిందే. 

 

 తాజాగా బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తన అభిమానులకు ఇంట్లోనే ఉండి సురక్షితంగా  ఉండండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం అది కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే కరిష్మా కపూర్ తనదైన నటనతో... తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని  బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మంచి అవకాశాలను చేజిక్కించుకుంది ఈ అమ్మడు. ఇక తాజాగా స్టే హోమ్ స్టే సేఫ్ అంటూ తాను ఇంట్లో ఉన్న ఒక ఫోటో నీ పోస్ట్ చేసింది కరిష్మా కపూర్.కాగా ఈ అమ్మడు పెట్టిన పోస్టు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: