IHG


తెలుగు లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన. తెలుగులో అగ్ర కథానాయికలతో పోటీ పడుతూ తన అందం , అభినయం తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. రష్మిక చేసిన ప్రతి సినిమా సక్సెస్ ల పంట పండుతుండడంతో దర్శక ,నిర్మాతలు క్యూ కడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో లో యాక్టీవ్ గా ఉంటోంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా జరిగిన కన్వర్జేషన్ లో ఓ అభిమాని తన చిన్నతనానికి చెందిన ఓ మధుర జ్ఞాపకాన్ని షేర్ చేయమనగా. వెంటనే తన చిన్న నాటి జ్ఞాపకాన్ని ఈ అమ్మడు షేర్ చేసింది.

 

 

చిన్నప్పుడు స్కూల్ అయ్యాక ఈవినింగ్ టూషన్ కి వెళ్లేప్పుడు ఓ ఇంట్లోని మామిడి చెట్టుకు ఉన్న మామిడి పండ్లను దొంగతనంగా కోశాము అది చుసిన ఆ చెట్టు ఓనర్ తమను కర్రతీసుకొని తరిమింది అయితే మేము ఆమెకు దొరక్కుండా పారిపోయాము అని చెప్పుకొచ్చింది. సరిలేరు నీకెవ్వరూ , భీష్మ సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఈ అమ్మడు లాక్ డౌన్ ని ఎంజాయ్ చేస్తోంది. ఈమె అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాకు సంతకం పెట్టింది. లాక్ డౌన్ నడుస్తున్నందున ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కథకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. రష్మిక మందన ఈ సినిమా ద్వారా రాయల సీమ యాసలో అదరగొట్టనుంది. ఈ విషయం బయటికి పొక్కినప్పటినుండి ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా రశ్మికను ఆ క్యారక్టర్ లో ఎలాఉంటుందో చూడాలని తెగ ఆసక్తి చూపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: