టాలీవుడ్ యువ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో తన కెరీర్ లో అతి పెద్ద విజయాన్ని అందుకోవడం జరిగింది. వాస్తవానికి అంతకముందు రెండేళ్ల పాటు సక్సెస్ కోసం ఎంతో ఎదురు చూసిన బన్నీకి మొత్తానికి ఈ సినిమా రూపంలో అది దక్కింది. కాగా రెండేళ్ల క్రితం బన్నీ హీరోగా తొలిసారిగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బన్నీ ఒక సోల్జర్ గా నటించిన ఆ సినిమా అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్ గా నిలిచింది. కాగా ఆ సినిమా ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన వక్కంతం వంశీ, మళ్ళి అప్పటి నుండి ఇప్పటివరకు రెండవ సినిమా చేయనేలేదు. 

 

వాస్తవానికి నా పేరు సూర్య తరువాత ఆయన తదుపరి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుందని ప్రచారం అవడం జరిగింది. ఎన్టీఆర్ కోసం మంచి పవర్ఫుల్ కథ సిద్ధం చేసిన వంశీ, ఆయనకు ఆ కథను వినిపించడం జరిగిందని, అలానే కథ ఎంతో నచ్చిన ఎన్టీఆర్ దాని పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన తరువాత సినిమా చేద్దాం అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదుగాని ఆ సినిమా మాత్రం వర్కౌట్ కాలేదు. ఆ తరువాత మరొక స్టార్ హీరోతో ఆయన సినిమా చేస్తున్నట్లు మరొక వార్త పుకారవడం జరిగింది. అయితే అది కూడా కార్యరూపం దాల్చకపోవడంతో ఇప్పటివరకు కూడా ఆయన తదుపరి సినిమా పై ఎటువంటి సమాచారం లేదు. 

 

కాగా ఈ కరోనా ఎఫెక్ట్ వలన ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆగిపోయి, అందరూ కూడా పూర్తిగా ఇళ్లకు పరిమితం అవడంతో, ఈ సమయంలో వంశీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన మంచి కథను సిద్ధం చేసాడని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి సక్సెస్ లతో అవకాశాలతో ముందుకు నడుస్తున్న యువ హీరో ఒకరు ఇందులో హీరోగా నటిస్తారని సమాచారం. అన్ని కుదిరితే లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని టాక్. మరి ఇది ఎంతవరకు సఫలమవుతుందో, వంశీ రెండవ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: