ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఓ మోస్తారు విజయం అందుకుని సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్. నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లో ఫర్వాలేదనిపించింది. పూర్తి థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని బాగానే అలరించింది. అయితే అన్ సీజన్ కావడంతో సినిమాకి రావల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.

 

నాని నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని చేధించే క్రమంలో ఎదురయ్యే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ డిటైల్స్ తో పాటు డాక్యుమెంటరీ డీటైలింగ్ తో ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాని తీర్చిదిద్దాడు. సినిమా చివరి వరకు సీటు ఎడ్జ్ మీద కూర్చోబెట్టే చిత్రంగా చెప్పవచ్చు. అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.

 

అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది. ముందుగా నాని నిర్మాతగానే వాల్ పోస్టర్ బ్యానర్ లో తెరకెక్కుతుందని చెప్పినప్పటికీ,, ప్రస్తుతానికి ఇంకా నిర్మాత దొరకలేదని సమాచారం. లాక్డౌన్ సమయంలో ఈ చిత్ర దర్శకుడు శైలేష్ కొలను హిట్ సెకండ్ కేస్ స్క్రిప్టు వర్క్ చేస్తూ కూర్చున్నాడట. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా హిట్ సెకండ్ కేసుకి సంబంధించి స్క్రిప్టు ఫైల్ చూపించాడు.

 

అంటే శైలేష్ కొలను ఈ స్క్రిప్టు పై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. అయితే ఈ సెకండ్ కేస్ ఎవరి నిర్మాణంలో తెరకెక్కనుంది, ఎవరు హీరోగా నటిస్తారనే విషయం మాత్రం తెలియదు. ఇదిలా ఉంటే హిట్ చిత్ర హిందీ రీమేక్ రైట్స్ ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడని ప్రచారం జరుగుతుంది. అక్కడి ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని బాగా ఆదరిస్తారన్న నమ్మకంతో దిల్ రాజు హిందీ రైట్స్ ని దక్కించుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: