తెలుగులో కొన్ని సినిమాలు చేసిన మీరా చోప్రా అనూహ్యరీతిలో తెరపైకి వచ్చారు. తనను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశారు. ఇటీవల ట్విటర్ వేదిగా మీరా చోప్రా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా.. దానికి ఆమె 'మహేష్ బాబు' అని ఆమె సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఆయనో సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చింది. అయితే మరి మా ఎన్టీఆర్ సంగతి ఏంటని మరో నెటిజన్ అడగ్గా... తాను ఎన్టీఆర్ ఎవరో తనకి తెలియదని.. నేను అతని ఫ్యాన్ కాదని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులకు కోపం వచ్చింది.
దీంతో మీరా చోప్రాపై అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ పెడుతూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తీవ్ర పదజాలంతో పచ్చి బూతులతో రెచ్చిపోయారు. దీనిపై మీరా చోప్రా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేశ్య, పోర్న్ స్టార్ వంటి దారుణమైన పదాలతో పిలుస్తారని ఊహించలేదని... కేవలం ఎన్టీఆర్ కంటే మహేష్ బాబునే ఎక్కువ ఇష్టపడతానని చెప్పడం వల్ల తనను అసభ్యకరమైన రీతిలో తిడుతున్నారని'' వాపోయింది మీరా చోప్రా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ.. 'మీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా' అని ఎన్టీఆర్ని ప్రశ్నించింది మీరా చోప్రా. తన ట్వీట్ పై ఎన్టీఆర్ తప్పకుండా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ట్వీట్ కి మహేష్ బాబుని కూడా ట్యాగ్ చేసింది మీరా.
@tarak9999 i didnt kno that ill be called a bitch, whore and a pornstar, just bcoz i like @urstrulyMahesh more then you. And your fans will send my parents such wishes. Do u feel successful with such a fan following? And i hope u dont ignore my tweet!! https://t.co/dsoRg0awQl
— meera chopra (@MeerraChopra) June 2, 2020
దీనిపై సింగర్ చిన్మయి స్పందించి.. సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయమని సలహా ఇవ్వడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది మీరా చోప్రా. అంతే కాదు తనను ఎలాంటి నీఛమైన పదాలతో దూసిస్తున్నారో తెలియజేస్తూ వాటి స్క్రీన్ షాట్స్ ని షేర్ చేసింది మీరా చోప్రా. కాగా మీరా చోప్రా 2006లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా 'బంగారం' చిత్రంలో నటించింది. ఆ తరువాత ‘వాన’ చిత్రంలో ఆకట్టుకుని, మారో, గ్రీకువీరుడు లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె 'మొగలిపువ్వు' అనే చిత్రంలో నటిస్తున్నారు.