మంచు మనోజ్ చాలా గ్యాప్ తీసుకుని దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్ లో అఘోర పాత్ర లో ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ ను కలిగిన సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ చిత్రం కావటంతో ఈ సినిమా కోసం మంచు మనోజ్ తీవ్రస్థాయిలో కష్టపడుతున్నాడు. సొంత నిర్మాణ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఫిలిం నగర్ టాక్. 2017 వ సంవత్సరం లో మంచు మనోజ్ నటించిన 'ఒక్కడు మిగిలాడు' సినిమా తర్వాత మరే సినిమా చేయలేదు.
ఆ తర్వాత తాజాగా మూడు సంవత్సరాల గ్యాప్ ఇచ్చి సొంత బ్యానర్లో ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్ తో వస్తున్న తరుణంలో మంచు వారి అభిమానుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా సినిమాలు చేస్తూనే మరోపక్క గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ తరహాలో బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. ఓ విశాలమైన స్థలంలో ఎకరం కలిగిన స్థలంలో రకరకాల ఎంటర్టైన్మెంట్ లు , గేమింగ్ లు , ఇతర ఇతర వ్యవహారాలను సెటప్ చేస్తూ ఓపెన్ జోన్ లు క్రియేట్ చేసే ఆలోచన మంచు మనోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విధంగా చాలామంది గేమింగ్ జోన్ లో వ్యాపారం చేసి క్లిక్ అయ్యారు. మంచు మనోజ్ కి కూడా మంచి విజన్ ఉండబట్టి ఆయన ఈ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీకి చెందిన మరో హీరో మంచు విష్ణు కూడా ఒకపక్క సినిమాలు చేస్తూనే మంచు మనోజ్ లాగా మరోపక్క విద్యాసంస్థలు వ్యాపారాలు చేస్తున్నారు.