పూజా హెగ్డే.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, హిందీ అన్న తేడా లేకుండా సినిమా పరిశ్రమపై దండయాత్ర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత వరుణ్ తేజ్తో ముకుంద, అల్లు అర్జున్తో దువ్వాడ జగన్నాథం, ఎన్టీఆర్తో అరవింద సమేత వీరరాఘవ, ‘మహేష్తో మహర్షి వంటి సినిమాలు చేసి వరుస హిట్లు అందుకుంది. ఇక ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంలో హీరోయిన్గా నటించి సూపర్ హిట్ కొట్టింది.
ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారింది పూజా హెగ్డే. అయితే సినిమాల విషయం పక్కన పెడితే.. ఈ మధ్య కాలంలో సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్లో చేసిన పూజా హెగ్డే కుర్రకారును ఓ ఊపు ఊపేసిందని చెప్పాలి. ఈ సాంగ్లో ముందుగా.. ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాణి.. కన్నైనా కొట్టవే జిగేల్ రాణి అంటూ రాంచరణ్ పాటను అందుకొన్నారు. దాంతో జిల్ జిల్ జిల్ జిగేల్ రాజా.. ఉన్నది అడిగితే నేను లేదంటానా? కాదంటానా అంటూ పూజాహెగ్డే షుషారుగా స్టెప్పులేస్తూ ఊపందుకుంటుంది.
ఈ సాంగ్లో రామ్ చరణ్ లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టగా…హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులతో ఊపేసింది. అప్పట్లో ఈ సాంగ్ ఓ రేంజ్లో దూసుకుపోవడంతో పాటు.. పూజా హెగ్డేకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడేలా చేసింది. యూట్యూబ్ లో జిల్..జిల్..జిగేలు రాణి సాంగ్ ను 126 మిలియన్ల మంది చూశారంటే పూజ చేసిన రచ్చ ఏ రేంజులో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. అసలు పూజా హెగ్డే జిగేల్ రాణి పాట... రంగస్థలం చిత్రానికే హైలైట్ గా నిలిచింది. అలాగే ఈ సాంగ్ పూజా హెగ్డే కెరీర్లోనే బెస్ట్ సాంగ్ అన్నపేరు కూడా తెచ్చుకుంది. కాగా, ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటిస్తోంది. మరియు అక్కినేని అఖిల్ సినిమాలోనూ నటిస్తోంది.