టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ కి ఉన్న క్రేజ్ గాని రేంజ్ గాని ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ హీరోల దగ్గర్నుంచి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల వరకు అందరు ఆయన డైరెక్షన్ లో నటించి ఒక మాస్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తారు. ముఖ్యంగా పూరి సినిమాలో హీరోగా చేస్తే కంప్లీట్ గా ఒక కొత్త క్రేజ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

మెగా పవర్ స్టార్ రాం చరణ్ డెబ్యూ సినిమాని తెరకెక్కించింది ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో చరణ్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన పూరి మొదటి సినిమాతోనే చరణ్ కి మాస్ హీరోగా మంచి క్రేజ్ వచ్చేలా చేశాడు.

 

ఇక ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ పూరి ని మాస్ హీరోగా నిలబెట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పటికే కొడుకుతో మెహబూబా సినిమాని తీసిన పూరి ఇప్పుడు రెండవ ప్రయత్నంగా రొమాంటిక్ అన్న సినిమాని తీశాడు. అయితే ఈ సినిమాకి పూరి కేవలం కథ అందించి నిర్మాతగానే ఉన్నాడు. దర్శకత్వం మాత్రం తన దగ్గర చేసిన అనిల్ పాడురి కి అప్పగించాడు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

 

అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ .. తన తనయుడు మోక్షజ్ఞ తేజ ని హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసే బాధ్యత పూరి కి అప్పగించినట్టు తెలుస్తుంది. పూరి అయితే మాస్ ఇమేజ్ వచ్చే సినిమాని తీస్తాడని తన కొడుకు లాంచింగ్ కి పూరి సరైన దర్శకుడని బాలయ్య భావిస్తున్నాడట. మరి ఇందుకు సంబంధిన అధికారక ప్రకటన వస్తే గాని క్లారిటి రాదు. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వం లో తన 106 వ సినిమాని చేస్తున్నాడు. జూన్ 10 న ఈ సినిమా నుండి గుడ్ న్యూస్ రానుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: