టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు టైం నడుస్తోంది. ఈ ఏడాది స్టార్టింగ్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బస్టర్ కోట్టడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మహేష్ హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నట్లు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు ప్రకటించడం జరిగింది. సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా కృష్ణా పుట్టినరోజునాడు 31వ తారీఖున రిలీజ్ చేయడంతో చాలా డిఫరెంట్ గా మహేష్ కనపడటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

IHG's Sarkaru Vaari Paata.. - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> Gone Viral

ఇదిలా ఉండగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ఎస్ తమన్ ని తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఒక్కసారిగా తమన్ అనేసరికి మహేష్ అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే ఇటీవల మహేష్ నటించిన చాలా సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం జరిగింది. సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ విషయంలో కొద్దిగ డల్ అవుట్ పుట్ ఇవ్వటంతో ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' కి తమన్  కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ‘అలా వైకుంఠపురం లో’ సినిమా తో అదిరిపోయే విధంగా పాటలు ఇవ్వటంతో మహేష్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

IHG

ఇదిలా ఉండగా ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుందట అది మామూలుగా ఉండదట. సామజ వర గమన సాంగ్ కి మించి తమన్ 'సర్కారు వారి పాట' లో ఒక సాంగ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో మహేష్ అభిమానులు ఈ మాత్రం చాలు మహేష్ డబల్ హ్యాట్రిక్ కొట్టడానికి 'సర్కారు వారి పాట' నాంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: