యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యువి క్రియోషన్స్ లో సొంతగా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ లతో కలిసి ఈ బ్యానర్ లో చిన్న సినిమాలతో పాటు సాహో లాంటి పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ సినిమాతో సక్సస్ ఫుల్ బ్యానర్ గా పాపులర్ అయింది యువి క్రియోషన్స్. ప్రస్తుతం ఈ బ్యానర్ లోనే ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ సినిమా రూపొందుతుంది.

 

IHG

 

పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సగభాగం చిత్రీకరణ జరుపుకుంది. లాక్ డౌన్ తర్వాత నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేస్తారట. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ని కూడా నిర్మించారట. అక్కడే దాదాపు చిత్రీకరణ మొత్త కంప్లీట్ కానుందని అంటున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో ప్రభాస్ కి సిస్టర్ గా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని సమాచారం. అంతేకాదు ఇప్పటికే ప్రభాస్ భాగ్యశ్రీ ల మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 

 

IHG

 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తన బ్యానర్ లో ఇద్దరు యంగ్ హీరోలతో సినిమాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తునారట. ఆ ఇద్దరే శర్వానంద్ అండ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే శర్వానంద్ తో యువి బ్యానర్ లో మూడు సినిమాలు నిర్మించారు. అలాగే విజయ్ దేవరకొండ తోను ఒక సినిమాని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఇద్దరితో మళ్ళీ సినిమాలని నిర్మించబోతున్నారట. అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా మల్టీ స్టారర్ గా నిర్మిస్తారా లేదా రెండు వేరే సినిమాలా అన్నది తెలియాల్సి ఉంది.  

 

IHG's film titled 'Fighter ...

 

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. అలాగే శర్వానంద్ శ్రీకారం అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో మరో రెండు సినిమాలని కమిటయ్యాడు. అందులో ఒకటి యువి బ్యానర్ లో ఉండబోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: