తెలుగులో తమిళ దర్శకుల హవా చాలాకాలంగా నడుస్తూనే ఉంది. మణిరత్నం.. మురుగదాస్.. యస్.జె.సూర్య ఇలా చెప్పుకుంటూ.. ఈ లిస్ట్ చాలా పెద్దదే. అయితే.. కన్నడ దర్శకులు తెలుగులో తీసింది ఒకటీ అరానే. అయితే.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగులో రెండు సినిమాలను ప్లాన్ చేశాడు. కన్నడవాడై ఉండి.. ఇక్కడ కాకుండా తెలుగులో తీస్తావా.. అని కన్నడిగులు విమర్శిస్తున్నా.. కేర్ చేయడం లేదు. ప్రశాంత్ నీల్ తెలుగులో తీసే సినిమాలేంటో తెలుసా.. 

 

పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ పేరు ఇండియావైడ్ పాపులర్ అయింది. ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు హీరోలు ఇంట్రెస్ట్ చూపించారు. కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తాడన్న వార్త ఆరునెలలుగా చెక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తారన్నది టాక్. గత గురువారం ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ విషెస్ తెెలియజేస్తూ స్టిల్ రిలీజ్ చేశారు. 

 

కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా దాదాపు ఖరారైనట్టే.. ఆ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. త్వరలో కలుద్దామని ట్వీట్ చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో.. ఈ కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్టే. ఇక తెలుగులో రెండో సినిమాను డివివి ఎంటర్ టైన్ మెంట్స్ లో చేసే అవకాశముంది. ఇంకా హీరో ఎవరో కన్ఫార్మ్ కాకపోయినా.. దర్శకుడు ఆ మధ్య మహేశ్ కు కథ వినిపించాడన్న వార్తను బట్టి చూస్తే.. ఈ కాంబినేషన్ కూడా సెట్ అయ్యే అవకాశముంది.

 

శంకర్, రాజమౌళి తీసేవన్నీ పాన్ ఇండియా మూవీసే అయినా.. మెయిన్ వెర్షన్ మాత్రం తమిళం, తెలుగులోనే తీస్తున్నారు. వాళ్లందరూ సొంత భాషలోనే తీయగాలేనిది.. మీరెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారని.. కన్నడిగులు ప్రశాంత్ నీల్ పై ఆ మధ్య విమర్శలు గుప్పించారు. తన ఒంట్లో కన్నడ నెత్తురు ప్రవహిస్తోందని సమాధానమిచ్చాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ తెలుగులో రెండు సినిమాలు వరుసగా తీస్తాడా.. లేదా తెలియాలంటే కెజీఎఫ్ 2 రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: