అనసూయ భరధ్వాజ్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. బుల్లితెర హాట్ యాంకర్గా పేరు తెచ్చుకున్న అనసూయ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి. అనూహ్యంగా పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత ఈ భామ కెరీర్ లో జోష్ వచ్చింది. ఒకవైపు మంచి మంచి షోలతో.. మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ఈ అందాల చందమామ.
ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమా తరువాత నుండి వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ బ్యూటీ. చాలా ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, తనకంటూ ప్రత్యేకత కథలో ప్రాధాన్యం కలిగి ఉన్న పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోంది.
అయితే బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ హిట్ అయిన రియాలిటీ షో జబర్దస్త్ ద్వారానే అనసూయకు ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ షో వల్లే తిరుగులేని ఇమేజ్, పాపులారిటీతో పాటు ఆర్థికంగానూ స్థిరపడింది అనసూయ. ఇక పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అనసూయ కెరీర్ పరుగులు పెడుతూనే ఉంది.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో అనసూయ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో.. ఇంట్లోనే ఉంటున్న అనసూయ సోషల్ మీడియా వేదికగా తన అందాలతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది. తాజాగా బ్లాక్ శారీలో ఉన్న అనసూయ ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.