చక్కని చుక్కలా ఉంది ఎవరా హీరోయిన్ అని చాలామంది ఆరా తీశారు. ఈమె ఇప్పటి హీరోయిన్ కాదు. 80వ దశకం కథానాయిక అని చెబితే.. నమ్మడం లేదు. నిజమా.. ఈమె ఆమేనా.. అంటూ షాక్ అవుతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో 15కేజీలు తగ్గి గుర్తుపట్టలేనంత స్లిమ్ గా తయారైన ఆ హీరోయిన్ ఎవరో కాదు ఖుష్బూ. 

 

తెలుగు, తమిళంలో హీరోయిన్ గా పాపులర్ అయిన ఖుష్బూ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ లో కనిపిస్తోంది. మరోవైపు సీరియల్స్ లో  నటిస్తోన్న ఈ హీరోయిన్.. ప్రస్తుతం అ్ననాత్త చిత్రంలో రజనీకాంత్ తో జతకడుతోంది. సహజంగానే బొద్దుగా కనిపించే ఖుష్బూ పెళ్లి తర్వాత వెయిట్ పెరగడంతో ఖుష్బూ ఇడ్లీ పేరుతో ఇడ్లీ ఫేమస్ అయింది. 

 

లాక్ డౌన్ టైమ్ ను ఖుష్బూ బాగా ఉపయోగించుకుంది. మూడు నెలల్లో ఏమి చేసిందో ఏమోగానీ. 15కేజీల బరువు తగ్గింది. సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఎవరీ కొత్త హీరోయిన్. కూతురు పోటీగా రెడీ తయారైందా. మళ్లీ హీరోయిన్ గా నటించేందుకు రెడీ అవుతుందా.. 15కేజీలు ఎలా తగ్గారో చెబుతారా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. 

 

మూడు నెలల్లో 15కేజీలు తగ్గిన ఖుష్బూ పట్టుదలను చూసిన నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. వయసులో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి వెయిట్ లాస్ అవొచ్చు. కానీ 50ఏళ్ల వయసులో ఆంటీ కాస్తా.. యంగ్ హీరోయిన్ గా మేకోవర్ కావడం కాదని.. ఎంతైనా.. ఖుష్బూ గ్రేట్ అంటారు. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న ఖుష్బూ ఇడ్లీ ప్లేస్ లో.. ఖుష్బూ పేపర్ దోసె పేరుతం ఐటమ్ వస్తుందేమో.. 

 

మొత్తానికి అలనాటి తార ఖుష్బూ నేటి తరం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారైంది. లాక్ డౌన్ టైమ్ లో కాస్త శ్రద్ధ పెట్టి స్లిమ్ గా తయారైంది. బొద్దుగా ఉండే బ్యూటీ కాస్త సన్నజాజి తీగలా తయారై యంగ్ బ్యూటీస్ కు పోటీగా నిలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: