మన తెలుగులో పాత హీరోయిన్స్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. వారికి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీనితో గతంలో స్టార్ హీరోయిన్ లు గా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మంచి మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్లామర్ లేకపోయినా పర్వాలేదు మంచి పాత్ర వస్తే చాలు సినిమాలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని వాళ్ళు చెప్తూ మంచి అవకాశాల్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అని చెప్పవచ్చు. అయితే వారికి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు అనేది చాలా మంది చెప్పే మాట. 

 

తాజాగా మాజీ హీరోయిన్ స్నేహకు ఒక అవకాశం వచ్చింది. ఒక సినిమాలో చిరంజీవి తో ఆమెకు చేసే అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం ఇప్పుడు సినిమాలు చేయలేకపోతుంది అని టాక్. లాక్ డౌన్ కారణంగా ఆమె అడిగిన మొత్తం ఇవ్వలేని పరిస్థితిలో దర్శక నిర్మాతలు ఉన్నారు అని అందుకే ఆమెను పక్కన పెట్టారు అని సమాచారం. ఇప్పుడు ఆమె తమిళ సినిమాల్లో మంచి పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ ఆమె దాదాపు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూడు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. 

 

మరి ఎప్పుడు ఆ సినిమాల షూటింగ్ మొదలు పెడతారు అనేది తెలియదు. ఇక ప్రభాస్ సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చింది అనే ప్రచారం టాలీవుడ్ లో జరిగింది. కాని అది నిజం కాదని తెలిసింది. ఆమె మరీ పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు అని ఇచ్చే పరిస్థితిలో దర్శక నిర్మాత లు లేకపోవడం తోనే ఆమెను పక్కన పెట్టారు అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: