స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ అన్న సినిమా చేయాల్సి ఉంది. కాని ఆ సినిమా పట్టాలెక్కకపోవడం తో మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల వైకుంఠపురములో సినిమా చేసి రికార్డ్స్ క్రియోట్ చేశాడు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో హైయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతేకాదు 2020 లో కూడా అల్లు అర్జున్ పై చేయిగా నిలిచాడు.

 

అయితే ఈ సినిమా తర్వాతైనా దిల్ రాజు - వేణు శ్రీరామ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఐకాన్ సెట్స్ మీదకి వస్తుందనుకున్నారు. కాని మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఆర్య, ఆర్య-2  వంటి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన సుకుమార్ తో సెట్స్ మీదకి వెళ్ళాడు అల్లు అర్జున్. పుష్ప టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేయనటువంటి ఒక మాసీ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాడు. అంతేకాదు అయిదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న పుష్ప త్వరలో షూటింగ్ కి సిద్దమవుతుంది. 

 

ఇక రీసెంట్ గా దిల్ రాజు ఐకాన్ మళ్ళీ మొదలవబోతుందని హింట్ ఇచ్చాడు. దాంతో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా త్వరలో మొదలవబోతుందని ఫ్యాన్స్ సంబర పడ్డారు. కాని తాజాగా అందిన సమాచారం ప్రకారం మళ్ళీ వాయిదా పడినట్టు తెలుస్తుంది. అందుకు ముఖ్యంగా పుష్ప సినిమా కారణం అని తెలుస్తుంది. ఇందులో ఒక డిఫ్రెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఐకాన్ లో చాలా క్లాసీగా కనిపిస్తాడట.

 

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు సినిమాలని ఒకేసారి షూటింగ్ జరపడం కుదరని పని కావడంతో ఇప్పటికే మొదలు పెట్టిన పుష్ప నే షూటింగ్ జరపాలని నిర్ణయించుకున్నారట. ఇక ప్రభుత్వం కూడా కొత్తగా మొదలయ్యో సినిమాలకి అనుమతులు ఇవ్వలేదని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: