మంచు విష్ణు, శ్రీనువైట్ల.. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లో పడాలనే తపనతో ఉన్న ఈ ఇద్దరు.. మరోసారి కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం హిట్ మూవీ సీక్వెల్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. 

 

మంచు విష్ణు కెరీర్ లో అతిపెద్ద హిట్ అంటే ఢీ సినిమానే అని చెప్పాలి. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఢీ మూవీ రేంజ్ ను అందుకోలేకపోయాయి. గత కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్న విష్ణు.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం మోసగాళ్లు అనే సినిమాలో నటిస్తున్న విష్ణు.. మరోసారి శ్రీను వైట్లతో కలిసి పనిచేయబోతున్నాడు.

 

ప్రస్తుతం శ్రీనువైట్ల పరిస్థితి చెప్పుకోలేకుండా ఉంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న వైట్ల.. ఎలాగైనా హిట్ కొట్టి.. మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. అందకోసం ఈ సారి తన హిట్ కామెడీ ఎంటర్ టైనర్.. ఢీ మూవీని నమ్ముకున్నట్టున్నాడు. ఢీ తర్వాత వరుస విజయాలు అందుకున్న శ్రీనువైట్ల.. ఆగడు సినిమా నుంచి పరాజయంలో పయనిస్తున్నాడు. అందుకే ఈ సారి ఢీ సీక్వెల్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 

 

మంచు విష్ణు-శ్రీను వైట్ల మధ్య ఢీ సీక్వెల్ గురించి కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ సీక్వెల్ కు డేరింగ్ అండ్ డ్యాషింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట.

 

ప్రస్తుత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక షూటింగ్ మొదలు పెట్టనున్నారట. మరి 13 ఏళ్ల తర్వాత వస్తున్న ఢీ కాంబినేషన్, సక్సెస్ ను రిపీట్ చేస్తూ.. మరోసారి విష్ణు-వైట్లకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: