సినిమారంగంలో హిట్ కొట్టాడు అంతే డైరెక్టర్ కి తిరుగుండదు. స్టార్ హీరోలు సైతం ఆ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతుంటారు. ఎలాగోలాగా ఆ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసి రిలీజ్ చేయాలని భావిస్తారు. కానీ అటువంటిది టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గత ఏడాది ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ అనే  సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ మారుతి ఇంకా ఖాళీగానే ఉన్నాడు. ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ సినిమా రిలీజ్ అయ్యి ఏడు నెలలుగా వచ్చినా తన నెక్స్ట్ సినిమా గురుంచి ఒక వార్త చెప్పలేదు. ఎవరితో చేస్తారు అన్న దాని గురించి ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు.

IHG

కాగా సాయి ధరంతేజ్ కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా అలరించింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో విడుదలయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత మారుతి ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ తో చేయాలని భావించడం జరిగింది. కానీ మధ్యలోనే ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటం జరిగింది.

IHG

ఆ తరువాత వరుణ్ తేజ్, నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ ఇంకా కొంతమంది హీరోల పేర్లు వినిపించినా వాళ్ళు ఎవరు ఈ ఏడాది గాని వచ్చే ఏడాది గాని సినిమా చేయడానికి కాల్షీట్స్ లేవని చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉండగా మారుతీ డైరెక్షన్లో ఇంతవరకు సినిమా రాకపోవడానికి కారణం ఆయన ఫన్నీ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సినిమాలు చేయడమే అని దాంతో పెద్దగా స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీంతో మారుతీ ప్రస్తుత పరిస్థితుల బట్టి ఓ వెబ్ సిరీస్ చేయాలనీ డిసైడ్ అని సమాచారం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: