మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. రాం చరణ్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డిసినిమా నిర్మిస్తున్నారు. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన రష్మిక మందన్న జోడీ కడుతుంది. ఈ సినిమా నుండి ఓ స్పెషల్ న్యూస్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. అదేంటి అంటే.. ఏదైనా ఒక సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ మాత్రమే ఉంటుంది.. కాని కొరటాల శివ ఈ సినిమాలో రెండు ఫ్లాష్ బ్యాన్ లను ప్లాన్ చేశాడట.

 

మొదట చిరు ఫ్లాష్ బ్యాక్ వస్తుందట.. అందులో రాం చరణ్ కనిపిస్తాడట. రాం చరణ్ ఎపిసోడ్ కు కూడా మరో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ రెండు ఫ్లాష్ బ్యాకులే సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తాయని తెలుస్తుంది. చిరు, చరణ్ ఇద్దరు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఇక ఆ హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే చరణ్ మగధీర సినిమాలో చిరు జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇక బ్రూస్ లీ లో కూడా చిరు రీ ఎంట్రీ అదిరిపోతుంది. ఇప్పుడు మొదటిసారి చిరు సినిమాలో చరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. చరణ్ పాత్ర కూడా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అని.. అసలు చెప్పాలంటే హీరో పాత్రని టర్న్ చేసేది చరణ్ రోల్ అని అంటున్నారు.

 

కరోనా వల్ల మూడు నెలలుగా షూటింగ్స్ ఆగిపోగా ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే ఆచార్య మళ్లీ సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను 2021 జనవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: