టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలు అనగానే చాలా వరకు కూడా కొందరు హీరోలు మాత్రమే చేస్తారు అనే పేరు ఉంటుంది. అందులో ముందు నుంచి కూడా చెప్పుకునే పేరు... చిరంజీవి ఉంటుంది ఆ తర్వాత నాగార్జున ఉంటుంది. ఇక టాలీవుడ్ లో ఈ తరానికి అయితే యాక్షన్ సినిమాలను అందించే విషయంలో ప్రభాస్ మాత్రం అందరికంటే ముందు ఉన్నాడు అనే చెప్పవచ్చు. ఈ తరంలో ప్రభాస్ మినహా యాక్షన్ సినిమాలను ఎవరూ చేయలేరు అని అంటారు టాలీవుడ్ జనాలు. అవును సాహో సినిమా చేసినా బిల్లా సినిమా చేసినా సరే ఆయనకు మాత్రమే అలాంటి పాత్రలు సూట్ అయ్యాయి అంటారు.

 

టాలీవుడ్ లో అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇప్పుడు యాక్షన్ సినిమాలను చెయ్యాలి అంటే చాలు భయపడే  పరిస్థితి టాలీవుడ్ లో ఉంది అనే మాట అందరికి తెలిసిందే. ఇక  ఇప్పుడు యాక్షన్ సినిమాలను  మాత్రం ఏ పాత్రలో అయిన సరే అతను చేస్తాడు అని ప్రభాస్ మినహా ఎవరికి కూడా సూట్ అవ్వదు అని అంటారు. బిల్లా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ప్రభాస్ పాత్ర మాత్రం సూపర్ హిట్ అయింది అనేది వాస్తవం. ఆ సినిమాలో ప్రభాస్ ని చూసిన టాలీవుడ్ షేక్ అయింది. ఆ పాత్రలో ఆయన మినహా ఎవరు చేసినా సరే చూడలేము అని చాలా మంది కామెంట్స్ కూడా చేసారు. 

 

కాగా ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమాను ఇప్పటికే సగం వరకు షూట్ చేసినా కొన్ని కొన్ని సన్నివేశాల కారణంగా అది వాయిదా పడింది. లాక్ డౌన్ అయిన వెంటనే షూట్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: