మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సామాజిక సందేశాన్ని ఇచ్చే కథల్ని కమర్షియల్ పంథాలో చెప్పే కొరటాల, మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూపించనున్నాడనేది ఆసక్తికర అంశంగా మారింది. అంతే గాక ఈ సినిమాలో ఎలాంటి సందేశాన్ని ఇవ్వనున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

 

 

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అందుకోసం రాజమౌళి నుండి పర్మిషన్ కూడా తీసుకుంది చిత్రబృందం. అయితే రామ్ చరణ్, చిరంజీవిలు ఒకే తెరపై ఎలా కనిపిస్తారన్నది అందరికీ ఆసక్తిగా మారింది. వారిద్దరి మధ్యలో వచ్చే సంఘటనలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా ఉంది. ఈ విషయమై తాజాగా ఒకానొక అప్డేట్ బయటకి వచ్చింది.

 

 

రామ్ చరణ్, చిరంజీవి గురుశిష్యులుగా కనిపించనున్నారని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్యలో ఫైట్ సీన్ కూడా ఉందట. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ పాత్ర చిరంజీవికి ప్రేరణ గొల్పేదిగాఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫైట్ ఎందుకు అవుతుందనేది తెలియకుండా ఉంది. అంతేగాక వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ రోమాలు నిక్కబొడుచుకేలా ఉండనున్నాయట.

 

 

మొత్తానికి ఆచార్య సినిమా ఐఫీస్ట్ లా ఉండనుందని అర్థం అవుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కోవిడ్ 19 కారణంగా షూటింగ్ నిలిపివేసిన ఈ సినిమా, ఈ సినిమా, షూటింగ్స్ కి అనుమతులు వచ్చిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో చిత్రీకరణకి బయలు దేరనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: