పూరీ జగన్నాథ్ బాలీవుడ్ ను టార్గెట్ చేశాడు. నార్త్ మార్కెట్ లో మేజిక్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు. హిందీలో వరుసగా మూడు సినిమాలు తీసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు పూరీ. ఇప్పటికే ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తోన్న పూరీ,.. తర్వాత రెండు ప్రాజెక్ట్స్ తర్వాత కూడా లాక్ అయ్యాయట. 

 

పూరీ జగన్నాథ్ బాలీవుడ్ లో హ్యాట్రిక్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు. నార్త్ లో వరుసగా మూడు సినిమాలు చేసేందుకు కథలు సిద్ధం చేస్తున్నాడు పూరీ. ఇక ఈ మూడు సినిమాలు కరణ్ జోహార్ నిర్మాణంలోనే రాబోతున్నాయని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమా టైమ్ లో అగ్రిమెంట్ కుదిరిందని ప్రచారం జరుగుతోంది. 

 

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా తీస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత కరణ్ నిర్మాణంలో పూరీ మరో రెండు సినిమాలు తీస్తాడని చెబుతున్నారు. 

 

సల్మాన్ ఖాన్ తో పూరీ జగన్నాథ్ సినిమా తీయబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు కరణ్-పూరీకి మధ్య మూడు సినిమాల డీల్ ఉందనే టాక్ రావడంతో.. సల్మాన్ ప్రాజెక్ట్ ను కరణ్ జోహారే సెట్ చేసి ఉంటాడని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు.

 

మరి ఈ డీల్ తో పూరీ కొన్నాళ్లు బాలీవుడ్ కే పరిమితమవుతాడా.. లేక బ్రేక్ తీసుకొని తెలుగు, హిందీ మార్కెట్స్ ని మ్యానేజ్ చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి పూరీ జగన్నాథ్ బాలీవుడ్ ను టార్గెట్ చేశాడు. నార్త్ మార్కెట్ లో పాతుకు పోయేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. చూద్దాం.. పూరీ జగన్నాథ్ మేనియా ఎలా పనిచేస్తుందో..!




మరింత సమాచారం తెలుసుకోండి: