సినీ ప్రపంచంలో ఏ హీరో, హీరోయిన్ అయినా కాంట్రవర్సీలకు బలి కాకుండా ఉండరు.  కానీ కొంత మంది మాత్రం ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు.. అలాంటి వారిలో మాలీవుడ్ బ్యూటీ నిత్యామీనన్ ఒకరు.  నిత్యామీనన్ ఎంత మంచి హీరోయిన్ అన్న విషయం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన సినిమాలు ఒకటి రెండు తెలుగులో వస్తూనే ఉంటాయి.

 

 మొదటి నుంచి ఎలాంటి ఎక్స్ పోజింగ్, గ్లామర్ పాత్రల్లో నటించకుండా చాలా స్టైలిష్ లుక్ తోనే కనిపిస్తుంది.  అంతే కాదు ఏలాంటి సినిమాలకైనా ఓకే చెప్పకుండా.. కథా బలం ఉన్న సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది. అందుకే ఈ అమ్మడికి ఎక్కువగా సెకండ్ హీరోయిన్ ఛాన్సులే ఎక్కువగా వచ్చాయి. అయితే పాత్ర ఏదైనా తనకు నచ్చితేనే చేస్తానని మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే.  

 

నటన ఉంటే చాలు సినిమాను చూస్తారని స్కిన్ షో ఉండి నటన లేకపోతే అది హోదా అవ్వదు అంటూ ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పింది కూడా. అయితే నిత్యా మొదటి నుంచి కాస్త బొద్దుగానే ఉంటుంది.. అందుకే ఆమెకు సినీ చాన్సులు తక్కువ వస్తాయని కామెంట్స్ కూడా వినిస్తున్నాయి. ఇదంతా పక్కన బెడితే.. ఇప్పుడు నిత్యా మీనన్ కొత్త అవతారం ఎత్తబోతుందట. కేవలం నటన కాకుండా సినిమా రంగంలో ఆమెకు దర్శకత్వం అంటే మహా ఇష్టం.

 

అందుకే, షూటింగులో తన సీన్స్ లేనప్పుడు.. కెమెరా వెనుక నిలబడి చిత్రీకరణ తీరును ఆమె పరిశీలిస్తూ వుంటుంది. ఈ అభిరుచితోనే దర్శకురాలు కావాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా ఈ లాక్ డౌన్ కాలంలో కొన్ని స్క్రిప్టులు సిద్ధం చేసుకుందట. 2022లో తప్పకుండా మెగా ఫోన్ పట్టుకోవాలన్నది ఈ ముద్దుగుమ్మ కోరిక. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: