మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు ఎగిరిగి గంతేస్తారు హీరోయిన్లు. అలాంటిది మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా సరే సింపుల్ గా సారీ అని చెప్పేసి సైడ్ అయ్యిందట మహానటి కీర్తి సురేష్. మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. అయితే మహేష్ కు ఓకే చెప్పిన ఈ అమ్మడు రెండు మెగా ఆఫర్లు మాత్రం కాలదన్నుకుందట.   

 

మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా ఒక సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అడిగితే ఆమె చేయనని చెప్పిందట. అంతేకాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వేణు శ్రీరాం డైరక్షన్ లో రాబోయే ఐకాన్ సినిమాలో కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కాని కీర్తి బన్ని సినిమాకు కూడా షాక్ ఇస్తూ చేయలేనని చెప్పిందట. ఐకాన్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా అందులో ఓ విలేజ్ గాళ్ రోల్ లో కీర్తిని అడిగారట. అయితే అది కొద్దిగా రొమాంటిక్ టచ్ ఉన్న పాత్ర కావడంతో ఆ ఛాన్స్ వదులుకుంది అమ్మడు.

 

మెగా సినిమాలు ఛాన్సులు వదులుకున్నా ఆమెకు తెలుగులో స్టార్ ఛాన్సులు వస్తున్నాయి. మహేష్ సర్కారు వారి పాట క్రేజీ మూవీ కాగా ఆ సినిమా హిట్ అయితే మాత్రం మరికొన్ని సినిమాల్లో నటిస్తుందని చెప్పొచ్చు. అజ్ఞాతవాసి తర్వాత తెలుగులో రెండు ఫీమేల్ లీడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న కీర్తి సురేష్ మహేష్ ఆఫర్ తో టాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తుంది. తెలుగులో మిస్ ఇండియాతో పటుగా మరో సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: