నానీ హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా  వచ్చిన సినిమా... ఎంసిఏ. ఈ సినిమాలో నానీ నటనకు చాలా మంచి మార్కులు పడగా సాయి పల్లవి కి మరో సారి టాలీవుడ్ ఫిదా అయిపోయింది అనే చెప్పాలి. ఆ విధంగా ఆమె తన నటన తో ఈ సినిమాలో ఆకట్టుకుంది. ఇక మాజీ హీరోయిన్ భూమిక కూడా తన మార్క్ నటన తో జనాలను బాగానే మెప్పించింది అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు ప్రేమను చెప్పుకునే విషయం మాత్రం యూత్ కిబాగా నచ్చింది అని చెప్పాలి. అవును యువతలో ఆ సీన్ లు బాగానే వెళ్ళాయి అనే చెప్పాలి. 

 

అది ఏంటీ అంటే ఈ సినిమాలో ఆమె నానీ ని వాళ్ళ అన్న పెళ్లి లో చూస్తుంది. ఆ తర్వాత నానీ అంటే ఇష్టం చూపిస్తుంది. ఇక నానీ ఎక్కడ కనపడినా సరే ఆమె నానీ ని ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడగడం అదే విధంగా కొన్ని కొన్ని సీన్ లు బాగా నచ్చాయి. ఇక ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం వాళ్ళు ఇద్దరూ బంధువులు కావడం అసలు నానీ ని ఆమె ఎందుకు ఇష్టపడింది అనేది చెప్పాలి అనుకోవడం ఇలాంటి సీన్ లు అన్నీ కూడా సినిమాలో చాలా బాగా హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. 

 

సినిమా తర్వాత  నానీ కెరీర్ కాస్త ఇబ్బంది  పడింది... హిట్ లు రాక  ఇప్పటికి కూడా నానీ ఇబ్బంది పడుతున్నాడు అనే చెప్పాలి. ఇప్పుడు అతను రెండు సినిమాల్లో చేస్తూ ఉండగా ఒక సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి అని చెప్పాలి. వచ్చే ఏడాది విడుదల అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: