ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఫైటర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వల్ల షూటింగ్లో ఆగిపోకపోయి ఉంటే దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకునేది. అయితే ఇప్పుడిప్పుడే షూటింగులు చిన్న చిన్నగా మొదలు పెడుతున్న నేపథ్యంలో ఫైటర్ స్క్రిప్ట్ లో పలు మార్పులు చేయబోతున్నారు అనే టాక్ ప్రస్తుతం టాలీవుడ్ టౌన్  లో వినిపిస్తోంది, తాజాగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ నటి నిర్మాత అయిన ఛార్మిని  వివరణ అడిగారు. ఫైటర్ స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి స్పష్టత ఇవ్వండి అంటూ కోరాడు. 

 


 అయితే దీనిపై తాజాగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది ఛార్మి. ఫైటర్ స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయట్లేదు అంటూ స్పష్టం చేసింది. అంతేకాకుండా చేసే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పింది, ఫైటర్ స్క్రిప్టు బ్లాక్ బస్టర్ అని తెలిపిన చార్మి... కరోనా  క్రైసిస్ పూర్తిగా ముగిసిన తర్వాతనే ఫైటర్  షూటింగ్ ప్రారంభిస్తాం అంటూ తెలిపింది. ఫైటర్ సినిమా విషయంలో చిత్రబృందం మొత్తం సూపర్ డూపర్ కాన్ఫిడెన్స్తో ఉంది అని... త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఒరిజినల్ టైటిల్ కూడా ప్రకటించబోతున్నట్లు చార్మి తెలిపారు. కాగా మొదటి సారి విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుండడంతో అటు  తెలుగు ప్రేక్షకులు కూడా వీరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుంది అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 


 ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి అనన్య పాండే ను కథానాయిక ఎంపిక చేసింది చిత్ర బంధం. ఇక ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో  విలక్షణ నటి రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ స్టార్ నిర్మాత అయిన కరణ్ జోహార్  కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతున్న ట్లు సమాచారంn ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తవగా... మరి కొన్ని రోజులు తర్వాత  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: