ప్రస్తుతం నిన్నటి తరం మొదటితరం సినీ ప్రముఖుల వారసులు  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. హీరోలు కమెడియన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది నిన్నటి మొన్నటి తరం సినీ ప్రముఖుల వారసులు ఉన్నారు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో. అయితే తమ వైవిధ్యమైన నటనతో అసలు సిసలైన వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఎంతో మంది టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ  ఇచ్చారు. 

 


 ప్రస్తుతం ఎంట్రీ ఇచ్చిన అందరు హీరోలు తనదైన గుర్తింపు సంపాదించుకుని  స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. దాదాపుగా మెగాహీరోల అందరికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వరుణ్ తేజ్ తెలుగు ప్రేక్షకుల మెగా ప్రిన్స్ గా మారిపోయాడు. ఇక వరుణ్ తేజ్ తన నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడమె  కాదు అంతకు మించి క్రేజ్ కూడా సంపాదిస్తున్నాడు అని చెప్పాలి. 

 

 తక్కువ సినిమాల్లోనే ఎంతో క్రేజ్ సంపాదించాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇక మొన్నటికిమొన్న గద్దల కొండ గణేష్ సినిమాలో నటించి తనలోని నటుణ్ణి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరూ వరుణ్ తేజ్ నుండి ఏదైనా సినిమా వస్తుంది అంటే అందులో సరి కొత్త కంటెంట్ తో  పాటు వరుణ్ తేజ్ అద్భుతమైన నటన కూడా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు గా ఎంట్రీ ఇచ్చి తండ్రికి మించిన ఖ్యాతిని సంపాదించారు వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: