సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా వారసత్వం అనేది కామన్ మారిపోయింది. రాజకీయ వారసులు రాజకీయాల్లో.. డాక్టర్ కొడుకు డాక్టర్..పోలీస్ కొడుకు పోలీస్.. టీచర్ కొడుకు టీచర్.. ఇలా ఏ రంగంలో వారు తమ వారసులు కూడా ఆయా రంగాల్లో తమకన్నా ఉన్నత స్థితిలో ఉండాలని భావిస్తుంటారు. ఇక సినిమా రంగంలోనూ అదే జరుగుతోంది. అలా వారసత్వాన్ని పుణికిపుచుకున్న హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఒకడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. గురంచి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
‘అల్లుడు శీను’తో కెరీర్ ప్రారంభించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తొలి సినిమాతోనే ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇదే సమయంలో శ్రీనివాస్ ఎంపిక చేసుకుంటోన్న కథలన్నీ వైవిధ్యమైనవే.ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్కు.. తెలుగులో లాగానే హిందీ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా అతని సినిమాలు తెలుగు లో ఎలా ఉన్నా హిందీ శాటిలైట్ విషయంలో బెల్లంకొండకు బాగానే గిట్టుబాటు అవుతోంది.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు చేసింది ఏడు సినిమాలే అయినా కావాల్సినంత గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు తండ్రి బెల్లంకొండ ఖ్యాతిని మరింత పెంచాడని అనడంలో సందేహం లేదు. అయితే ఆయన నటించిన సినిమాల్లో ఎక్కువగా పరాజయాలే పలకరించినా మొక్కవోని దీక్షతో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇందుకు బెల్లంకొండ సురేష్ కూడా తన కొడుకుని ప్రోమోట్ చేసుకునే విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు.
ఇక ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన“రాక్షసుడు” సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో నిర్మాత, సాయి శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నాడు నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు.