లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ టాలీవుడ్ లో నటించిన సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. అయితే అనూహ్యంగా కనపడకుండా పోయింది. చెప్పాలంటే శృతిహాసన్ కి సక్సస్ లు ఎక్కువే. అయినా ఎందుకనో శృతిహాసన్ సినిమాలు చేయకుండా కనుమరుగైపోయింది. రెండు సార్లు పవన్ కళ్యాణ్ సరసన నటించి మెగా ఫ్యాన్స్ కి బాగా దగ్గరైంది. అంతేకాదు అల్లు అర్జున్, రాం చరణ్, మహేష్ బాబు, రవితేజ సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకుంది.

 

అయినా శృతిహాసన్ టాలీవుడ్ లో ఎక్కువ సంవత్సరాలు కోనసాగలేదు. అయితే మళ్ళీ రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ సినిమాతో చాలా కాలానికి టాలీవుడ్ కి వస్తుంది. ఇదే కాంబినేషన్ లో గతంలో బలుపు సినిమాలో నటించిన శృతిహాసన్ కి మంచి హిట్ దక్కింది. చెప్పాలంటే క్రాక్ రవితేజ-గోపీచంద్ మలినేని-శృతిహాసన్ లకి చాలా కీలకం. ఈ సినిమా సక్సస్ అయితే ఈ ముగ్గురికి మళ్ళీ పూర్వ వైభవం ఉంటుంది.

 

ఇక ఇలా రీ ఎంట్రీ ఇస్తూనే పవన్ కళ్యాణ్ సినిమాలోను నటించే అవకాశం అందుకుంది. అదే వకీల్ సాబ్. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పవన్ కళ్యాణ్ తో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుందట. పాత్ర నిడివి చాలా చిన్నదే అయినప్పటికి సినిమాలో చాలా కీలకంగా ఉండేలా దర్శకుడు వేణు శ్రీరాం ఆ పాత్రని తీర్చి దిద్దాడట. అయినా కొంత శృతిహాసన్సినిమా ఒప్పుకోవడానికి ఆలోచిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 

అంతేకాదు మొత్తం మీద 7-10 రోజులు ఉండే చిత్రీకరణకి దాదాపు 70-80 లక్షల వరకు డిమాండ్ చేస్తుందన్న టాక్ కూడా ఉంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమా తో పోల్చుకుంటే రవితేజ క్రాక్ తోనే మళ్ళి తన సక్సస్ మొదలవుతుందన్న శృతిహాసన్ ఆలోచనే అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: