దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత, ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో కుర్రకారుని మాయచేసి వరుస అవకాశాలని దక్కించుకుని తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కినేని నాగచైతన్య ని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే గత ఏడాది ఆమే చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ఓ బేబీ బ్లాక్ బస్టర్ అందుకుంది.

 

సినిమా తర్వాత తమిళ చిత్రమైన 96 రీమేక్ జానులో నటించింది. ఈ సినిమా తెలుగులో సరిగ్గా ఆడలేదు. అయితే జాను తర్వాత సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనేది ఇంతవరకూ ప్రకటించలేదు. పెళ్ళి తర్వాత గ్లామర్ పాత్రల్లో కాకుండా కథా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించడానికి ఇష్టపడుతున్న సమంత తన నెక్స్ట్ మూవీ లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఉండనుందని సమాచారం. అంతే కాదు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుందట.

 

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత పాన్ ఇండియా చిత్రంలో నటించలేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ వారితో ఓ సినిమాకి సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్నారట. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా సమంత కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పవచ్చు. అంతే కాదు ఈ సంవత్సరం చివరికల్లా ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారట.

 


మొత్తానికి సమంత కూడా పాన్ ఇండియా బాట పట్టిందన్నమాట. లేడీ ఓరియంటేడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా తెలియదు. సాంకేతిక నిపుణులు ఎవరనే విషయం త్వరలో వెల్లడించనున్నారట. ఇందులో సమంతతో పాటు ఎవరెవరు నటిస్తారనేడీ ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: