ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోయింది. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పూరి జగన్నాథ్, మణిశర్మ, రామ్ పోతినేని లకి కమ్ బ్యాక్ చిత్రంలా ఉపయోగపడింది. టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇస్మార్ట్ ద్వార బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

 


అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకి సూపర్ హిట్ దొరికింది. అప్పటి వరకూ చాక్లెట్ బాయ్ తరహా పాత్రలే చేసిన రామ్ మాస్ పాత్రల్లోనూ అదరగొట్టగలడని ఇస్మార్ట్ శంకర్ నిరూపించింది. అయితే ఆ సినిమా తర్వాత రామ్ చేస్తున్న రెడ్ పై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. తమిళ చిత్రమైన తడం సినిమాకి తెలుగు రీమేక్ వస్తున్న రెడ్ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. 

 

ఇది కూడా మాస్ మసాలా చిత్రమే అని టీజర్ చూస్తే అర్థమైపోయింది. అయితే ఈ సినిమా అనంతరం రామ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడనేది ఆసక్తిగా మారింది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో మాస్ జనాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న రామ్, మరోసారి మాస్ సినిమాతోనే వద్దామని అనుకుంటున్నాడట. అందుకే తన వద్దకి మాస్ టచ్ ఉన్న కథలు తీసుకురావాలని అనుకుంటున్నాడట.

 

ఈ నేపథ్యంలో స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఉండనుందని టాక్ వినబడింది. సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇటు రామ్ కూడా రెడ్ తర్వాత తన సినిమా ప్రకటించలేదు. సో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ సినిమా ఉంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: