సాధారణంగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన కొందరు హీరోయిన్లు.. పెళ్లి వల్లనో లేదా ఆఫర్లు తగ్గిపోవడం వలన కొంతకాలానికే సినిమాలకు దూరమవుతుంటారు. అలాంటి వారిలో కామ్నా జెఠ్మలాని కూడా ఒకరు.. టాలీవుడ్ సినిమాల్లో సరదా సరదా పాత్రల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కామ్నా జెఠ్మలాని.. టాప్ హీరోల సరసన ఆఫర్లను మాత్రం దక్కించుకోలేక పోయింది. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటి. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు.
అయితే కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి మంచి గుర్తింపునిచ్చింది. రణం, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కత్తి కాంతారావు, యాక్షన్ 3D వంటివి కామ్నా కెరీర్లో చెప్పుకోదగిన చిత్రాలు. ఇక సినిమాలు తగ్గిపోయాయనుకుంటున్న తరుణంలోనే బెంగుళూరుకు చెందిన ఓ బిజినెస్మేన్ని పెళ్లి చేసుకుంది కామ్నా. సినీతారలు ఆడే సిసిఎల్ క్రిరెట్ టోర్నీ సందర్భంగా సూరజ్తో కామ్నాకు పరిచయం ఏర్పడిందని, ఈ క్రమంలోనే ఇద్దరి మనసులు కలిసి ఒకటయ్యారట. అయితే వీరి వివాహక వేడుక చాలా రహస్యంగా, ముఖ్యంగా మీడియాకు తెలియకుండా జరిగింది.
ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటని సన్నిహితులు అడిగితే....పెళ్లయిందని తెలిస్తే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని అలా చేయాల్సి వచ్చిందని చెప్పిందట. ఇక పెళ్లి అయ్యాక చంద్రిక అనే హారర్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కామ్నా సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది కామ్నా. మరియు కామ్నాకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. మొత్తానికి కామ్నా ఓ మంచి భార్యగా గృహిణిగా సెటిల్ అయింది. అయితే పిల్లలు ఇప్పుడు పెద్దయ్యారు కాబట్టి.. మళ్లీ సినిమాల్లోకి వస్తానంటోంది కామ్న. తనకు సూటయ్యే పాత్రలు దొరికితే తిరిగి నటిస్తానంటోంది.