బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఇప్పటికీ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. ఎంఎస్ ధోని’ బయోపిక్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిప్రెషన్తో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, సుశాంత్ గదిలో సూసైడ్ నోట్ ఏమీ లభించలేదు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు..? అన్నది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.
అయితే సుశాంత్ చనిపోయినప్పటి నుంచి రోజుకో కథనం వినిపిస్తూనే ఉంది. ఒకసారి తను డిప్రెషన్లో ఉన్నందువల్ల ఆత్మహత్య చేసుకున్నాదని.. ఒకసారి తనకి ఆఫర్లు లేకపోవడం వల్లని.. ఒకసారి బాలీవుడ్ పెద్దలే అని ఇలా రోజుకో విషయం బయట పడుతోంది. కాని, అతనిది హత్య కాదు ఆత్మహత్యే అని పోస్ట్మార్టం రిపోర్టులో తేలినప్పటికీ.. ఈ ఆత్మహత్య వెనుక కారణాలేంటి? ఎవరైనా ప్రేరేపించారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు అతని సన్నిహితులను విచారించారు ముంబై పోలీసులు.
అయితే ఇలాంటి సమయంలో సుశాంత్ ఆత్మహత్యకు అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ బీహార్లోని ముజఫ్ఫర్పూర్కి చెందిన కుందన్కుమార్ కోర్టులో కేసు వేశారు. అందులో సుశాంత్తో రియా కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఆర్థికంగా, మానసికంగా సుశాంత్ను అన్నిరకాలుగా వాడుకుంది. తన కెరీర్కు వాడుకుంది. తన కెరీర్ చక్కబడగానే సుశాంత్ వదిలేసింది.
దాంతో సుశాంత్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ ఆత్మహత్యకు ప్రేరేపించింది ఆమే. ఇలా రియా చక్రవర్తిపై కేసు నమోదు అయింది. దీనిపై విచారణ జూన్ 24 న జరగనుంది. అయితే ఇక్కడ రియాపై మానసిక దోపిడ అనే ముద్ర వేయడంతో.. హాట్ టాపిక్గా మారింది. దీంతో మానసికంగా కుంగిపోయి సుశాంత్ ఆత్యహత్య చేసుకుంటే రియా నేరస్తురాలు అవుతుందా..? అసలు ఎవరితో కలిసి ఉండాలో.. వద్దో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రియాకు లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.