'మహానటి' సినిమా తో ఒక్కసారిగా ఇండస్ట్రీ లో ఉండే పెద్దల చూపులను తన వైపుకు కీర్తి సురేష్ తిప్పుకుంది.  తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న కీర్తి సురేష్ అచ్చం తెలుగింటి అమ్మాయిల హావభావాలతో తన నవ్వు తో ప్రేక్షకులను ఎంతో మైమరిపించే ఈ ముద్దుగుమ్మ ఇటీవల అనేక ఆఫర్లు అందుకుంటుంది. అభిమానులను కూడా బాగా సంపాదించడంతో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉండటంతో పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. ఇటువంటి క్రేజ్ కలిగిన కీర్తి సురేష్ ఓటిటి ప్లాట్ ఫాం లో రిలీజ్ చేసే సినిమాలను చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందట.

IHG

చాలా వరకు ఇటీవల ఆమె దగ్గరికి ఇలాంటి కథలు వచ్చినట్లు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీంతో అభిమానులు ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ ఉండటం లేదని, పొరపాటున అటువంటి ప్రయోగాలు చేయొద్దని, కెరీర్ బ్యాడ్ అయ్యే నిర్ణయం తీసుకోకు అని దండం పెడుతున్నారట.

IHG

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయ్యే అవకాశం నీకే ఉంది ఇలాంటి సమయంలో ప్రయోగాలు వద్దు తల్లి… పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసి థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపించాలని సూచనలు ఇచ్చారట. మరోపక్క ప్రభుత్వ అనుమతులతో ఇప్పుడిప్పుడే షూటింగ్ స్టార్ట్ అవుతున్న తరుణంలో మరోపక్క కరోనా వైరస్ కి మందులు కూడా వరుసగా వస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే థియేటర్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: