టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పటికే గడచిన రెండేళ్లలో వరుసగా నటించిన మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ముందుగా భరత్ అనే నేను, ఆ తరువాత మహర్షి, ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన సూపర్ స్టార్, అతి త్వరలో యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. ఇకపోతే మహేష్ బాబు రాబోయే సినిమాల లైన్ అప్ చూస్తే నిజంగా ఎవరికైనా మతిపోకతప్పదు అనే చెప్పాలి. 

IHG

ఓవైపు సర్కారు వార్ పాట షూటింగ్ జరుగుతుండగా త్రివిక్రమ్ లేదా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాను మహేష్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. అలానే మరోవైపు వంశీ పైడిపల్లి, రాజమౌళి వంటి వారు మహేష్ తో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరి మహేష్ తో తమ నెక్స్ట్ సినిమాలు ఉంటాయని ప్రకటన కూడా రావడం జరిగింది. అలానే వీరితో పాటు పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి వంటి వారు కూడా సూపర్ స్టార్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్. ఇప్పటికే పూరి తన కెరీర్ లో ఎంతో ఇష్టంగా రాసుకున్న జనగణమన సినిమాని మహేష్ తోనే చేసేందుకు మంచి రోజు చూసుకుని ఆయనను కలిసి కథను వినిపించేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్తున్నారు. అలానే వీరితో పాటు 

 

అతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సూపర్ స్టార్ కోసం కూడా ఒక పవర్ఫుల్ సబ్జక్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఇక ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో మహేష్ బాబు చేయబోయే ఈ సినిమాల లైన్ అప్ నిజంగా సూపర్బ్ అనే చెప్పాలి. వాస్తవానికి మహేష్ వంటి హాలీవుడ్ హీరో స్థాయి అందం, కోట్లాది మంది అబిమానగణం, క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న నటుడితో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి ఉంటుందని, తప్పకుండా ఇకపై రాబోయే రోజుల్లో మహేష్ కెరీర్ లో చాలా వరకు మరింత సక్సెస్ఫుల్ సినిమాలు రానున్నట్లు ఆయన తదుపరి ఈ దర్శకుల లైన్ అప్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: