ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఏ స్థాయిలో సంచలనం సృష్టించింది అనే  విషయం అందరికి తెలిసిందే. ఈ  హీరో మరణం ఏమో గాని ఇప్పుడు బాలీవుడ్ లో సినీ ప్రముఖులు అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు. ఎవరూ కూడా  సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ గా ఉండటం లేదు. ప్రముఖులు అందరిని కూడా ఫాన్స్ టార్గెట్ చేయడం తో  భయపడుతున్నారు అనే చెప్పాలి. ఇక సోనాక్షి సిన్హా సోషల్ మీడియా కు పూర్తిగా దూరం అయింది. సల్మాన్ ఖాన్ కూడా సోషల్ మీడియాకు దూరం అయ్యే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. మరొకరు కూడా సోషల్ మీడియాలు దూరం అయ్యారు. నేహా కక్కర్ అనే బాలీవుడ్ సింగర్ ట్రోల్ తట్టుకోలేక సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలోనే ప్రకటించారు. ద్వేషం, అసూయ ఉన్నందువల్ల నేను కొన్ని రోజులు దూరంగా వెళుతున్నానని ఆమె పేర్కొంది. గుడ్ నైట్ చింతించకండని చెప్పుకొచ్చింది.  నేను  నిద్రలోకి తిరిగి వెళుతున్నానని... స్వేచ్ఛ, ప్రేమ, గౌరవం, సంరక్షణ, సరదా ఉన్న మెరుగైన ప్రపంచం ఉన్నపుడు నన్ను మేలుకొలపండని ఆమె పేర్కొంది. 

 

ఇక మరి కొందరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాకు దూరం అయ్యే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. అగ్ర హీరోలు, కరణ్ జోహార్ లాంటి వ్యక్తి కూడా సోషల్ మీడియాకు దూరం అయ్యే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం.  సుశాంత్ మరణం కి ప్రధాన కారణం... వారసత్వ మాఫియా అని పేర్కొంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ఇంకెంత మంది సోషల్ మీడియాకు గుడ్ బై చెప్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: