పూరీ జగన్నాథ్ గతేడాది రామ్తో తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఫామ్లోకి వచ్చాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన పూరీకి మళ్లీ ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయ్. అంతేకాదు రెట్టింపు ఉత్సాహంతో ఆయన మంచి సినిమాలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యూత్లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నారు. నెక్స్ట్ చేయబోయే రెండు మూడు సినిమాల వరకు కూడా పూరీ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక టాలీవుడ్ అగ్ర, సీనియర్ కథానాయకులకు మాత్రం స్టోరీలు చెప్పడానికి పూరీ ఇష్టపడకపోవడం గమనార్హం.
యంగ్ అండ్ డైనమిక్ హీరోలే తన కథలకు సెట్ అవుతారంటూ తన సన్నిహితుల వద్ద కుండబద్దలు కొట్టేస్తున్నారట. అంతేకాకుండా పూరీ తెరకెక్కించే సినిమాలన్నీ కూడా ఇకపై పాన్ ఇండియా ఉండనున్నాయని తెలుస్తొంది. ఇక ప్రభాస్తోనూ ఓ సినిమా పూరీ చేయబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పట్లో ప్రభాస్తో పూరీ సినిమా ఉండకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా పూరీ ఇప్పుడైతే యమ బిజిబిజీగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఇదిలా ఉండగా పూరీ తన కలల ప్రాజెక్టు జనగణమన గురించి మరోసారి చెప్పుకురావడమే తాజాగా ఆయన వార్తల్లో నిలవడానికి కారణం.
పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ గా ఎప్పటి నుంచో చెబుతున్న ‘జనగణమన’ను అతి త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తాని వెల్లడించారు. వాస్తవానికి బిజినెస్మెన్ సినిమా తర్వాత మహేశ్బాబుతో కలసి ఈ సినిమా చేయాల్సి ఉండేంది. అయితే కథ నచ్చినా..పూర్తి స్ర్కిప్ట్లో కొంత కన్ఫ్యజన్ ఉందని మహేష్ పూరికి నో చెప్పాడు. అయితే ఈ సినిమాను మరో హీరోతో తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారంట. ఇందులో హీరో ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే దీని గురించి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. కథ విషయానికి వస్తే మిలటరీ బ్యాక్డ్రాప్లో ఉండనుందని వివరించారు. చూడాలి మరీ పూరీ సినిమాలో కథానాయకుడుగా ఎవరు నటించబోతున్నారో..!!