తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి అన్న విషయం తెలిసిందే. చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకూ ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే వుంటాయి. అయితే ఇలా వచ్చిన సినిమాలలో కొన్ని డైలాగులు తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు చెప్పే కొన్ని డైలాగులు అయితే టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తాయి అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సృష్టించిన  ఎన్నో రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను నోళ్ళల్లో నానుతూనే  డైలాగ్ కొత్త బంగారు లోకం సినిమాలు శ్వేతా బసు ప్రసాద్ చెప్పిన ఏకాడా  అనే ఒక డైలాగ్. 

 


 ఈ ఒక్క డైలాగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్త బంగారు లోకం సినిమాలు వరుణ్ సందేశ్ కు జోడిగా నటించిన శ్వేతా బసు ప్రసాద్ ఏకాడా అంటూ సాగదీస్తూ చెప్పిన ఈ డైలాగ్ ఎంతో మందిని ఆకర్షించింది. ముఖ్యంగా యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఒక్క డైలాగ్ తో శ్వేతా బసు కి ఎంతగానో క్రేజ్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులందరినీ ఒక్క డైలాగ్ తో తనవైపు తిప్పుకుంది శ్వేత బసు ప్రసాద్. 

 


 ఇక ఈ ఒక్క డైలాగ్ తనకు వరుస ఆఫర్లు కూడా తీసుకు వచ్చి పెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర సీమలో ఈ ఒక్క డైలాగ్ తో మంచి క్రేజ్ వున్న హీరోయిన్గా మారిపోయింది బసు ప్రసాద్. ఇక కొత్త బంగారులోకం సినిమాలో శ్వేతా బసు ప్రసాద్ నటనకు  కూడా మంచి మార్కులే పడ్డాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమా వచ్చి ఎన్నో  సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సినిమాలో శ్వేతా బసు చెప్పిన డైలాగ్ తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది. అంతలా ప్రభావితం చేసింది ఈ ఒక్క డైలాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: