శృతి హాసన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన `హే రాం` సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన `లక్` సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్ నటించింది.
ఇక తెలుగులో కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో 2011లో ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది.
ఆ తర్వాత తెలుగులో ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తోంది.
మాస్ మహారాజ్ రవితేజ సరసన క్రాక్లో ఈ బ్యూటి నటిస్తుంది. అలాగే మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా శృతి నీటిలో ఈదుతూ సాగరకన్యలా ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.